మర్పల్లి: బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని ఆ పార్టీ వికారాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని జంషేద్పూర్, రామపూర్, పట్లూర్ జీపీ తాండాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రం అన్నిరంగాల్లో పురోగతి సాధించిందన్నారు. మరోసారి ఆశీర్వదించి కారు గుర్తుకే ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు మధూకర్, పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, వైస్ ఎంపీపీ మోహన్రెడ్డి నాయకులు ప్రభాకర్గుప్తా, అశోక్, రమేశ్మిత్ర, రాచన్న, మధూకర్, గౌస్, గఫార్, సర్పంచ్లు నూరొద్దీన్, ఇందిర, ఎంపీటీసీ సభ్యుడు బిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్