Sakshi News home page

నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం

Published Sat, Nov 18 2023 12:26 AM

-

మహారాణిపేట : ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజా పరిషత్‌ సర్వసభ్య సమావేశం శనివారం ఉదయం 10.30 గంటలకు జెడ్పీ చైర్‌పర్సన్‌ జె. సుభద్ర అధ్యక్షతన జరగనుందని సీఈవో ఎం.పోలినాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జరిగే సమావేశానికి గౌరవ సభ్యులు, ఆహ్వానితులు హాజరు కావాలని ఆయన కోరారు. సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు పూర్తి సమాచారంతో హాజరు కావాలన్నారు.

1 నుంచి 7 వరకు

స్థాయీ సంఘ సమావేశాలు

శనివారం ఉదయం 9 గంటలకు స్థాయీ సంఘ సమావేశాలు ప్రారంభం అవుతాయన్నారు. ఉదయం 9 గంటలకు 2, 5వ స్థాయి, 9.30 గంటలకు 3, 4వ స్థాయి, ఉదయం 10 గంటలకు 1, 6, 7వ స్థాయీ సంఘాల సమావేశాలు నిర్వహించనున్నట్లు సీఈవో ఆ ప్రకటనలో తెలిపారు.

Advertisement
Advertisement