మూడు వాహనాలు ఢీ.. 10 మందికి గాయాలు

10 Feb, 2016 12:26 IST|Sakshi

వేగాంగా వస్తున్న రెండు ద్విచక్ర వాహానాలు ఆటోను ఢీకొట్టిన ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. అందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గొట్టువానపల్లి సమీపంలో బుధవారం చోటుచేసుకుంది.
 గొట్టువానపల్లి గ్రామం నుంచి కళ్యాణదుర్గం వెళ్త్ను ప్రయాణికుల ఆటోను ఎదరుగు వస్తున్న రెండు బైక్‌లు ఢీకొట్టాయి. దీంతో ఆటోలో ఉన్న పది మందికి గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అందులో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు