ఏపీలో మరో 1775 కరోనా కేసులు

11 Jul, 2020 17:39 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,775 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు ఇతర రాష్ట్రాలకు నుంచి వచ్చిన  34 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో నలుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటిన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 14393 మంది కరోనా నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అయ్యారు.

గడిచిన 24 గంటల్లో కర్నూలులో నలుగురు, గుంటూరులో ముగ్గురు, విజయనగరం ముగ్గురు, కృష్ణాలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు.. అనంతపురం,కడప,విశాఖపట్నంలో ఒక్కరు చొప్పున మొత్తం 17  మంది కరోనా వైరస్‌ బారినపడి  మరణించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 309 మంది మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 27,235కు చేరుకుంది. రాష్ట్రంలో మొత్తం 12,533 యాక్టివ్‌  కేసులు ఉన్నాయి. ఏపీలో ఇప్పటివరకు 11,36,255 కరోనా  నిరార్ధణ  పరీక్షలు నిర్వహించారు.

>
మరిన్ని వార్తలు