ఏపీలో మరో 755 కరోనా కేసులు..

28 Jun, 2020 13:50 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 755 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 50, విదేశాల నుంచి వచ్చిన వారిలో 8 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 13,098కి చేరింది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 25,778 శాంపిల్స్‌ను పరీక్షించగా 755 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. (‘మహమ్మారికి భయపడితే ఆకలితో చస్తాం’)

గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 401 మంది క్షేమంగా డిశ్చార్జ్‌  అయ్యారు. కరోనా బారిన పడి కర్నూలులో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, పశ్చిమగోదావరిలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7021 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 8,41,860 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరిగాయి. (ఏపీలో 8 లక్షలు దాటిన  కరోనా పరీక్షలు)

మరిన్ని వార్తలు