విజయవాడ: తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని కర్రి సౌమ్య ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన మరణానికి వేధింపులే కారణమని సూసైడ్ నోట్లో రాసి ఉంది. ఈ విషాదం పెనమలూరు మండలం సనత్నగర్లో చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి విద్యార్థిని కర్రి సౌమ్య మృతికి వేధింపులే కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పాఠశాలకు వెళ్తున్న సౌమ్యను నాని అనే ఆకతాయి తరచు వేధింపులకు గురిచేస్తుండేవాడని ఆమె సోదరి స్వాతి అంటోంది.
‘‘ నాని అనే యువకుడు రోజూ అక్కను వేధిస్తుండేవాడు. నిన్న కూడా స్కూల్కు వెళ్తుంటే అసభ్యకరంగా మాట్లాడాడు. అక్కకు కోపం వచ్చి చెప్పు తెగుద్దని హెచ్చరించింది. దీంతో అతను అక్క ముఖంపై ఉమ్మేశాడు. గతంలో నాని ఇలాగే వేధించేవాడు. ఈ విషయాన్ని బాబాయ్కు కూడా చెప్పాం’’ అని స్వాతి చెబుతోంది. విద్యార్థిని మరణంపై పూర్తి విచారణ జరిపించి నిందితుడిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.