ఫార్మా కంపెనీలో పేలుడు.. ఒకరు మృతి

2 May, 2017 12:16 IST|Sakshi
ఫార్మా కంపెనీలో పేలుడు.. ఒకరు మృతి

పరవాడ(విశాఖపట‍్టణం జిల్లా): విశాఖపట‍్టణం జిల్లా పరవాడలోని ఓ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

ఎజికో ఫార్మా కంపెనీలో మంగళవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటనలో రియాక‍్టర్‌ మెయిన్‌ హోల్‌ ఓపెన్‌ అయి ఆ ప్రాంతమంతా దట‍్టమైన పొగ కమ‍్ముకుంది. దాంతో కార్మికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. క్షతగాత్రులను కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున‍్నారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు