సెప్టిక్ ట్యాంక్‌లో పడ్డ బాలుడు

2 Oct, 2015 17:05 IST|Sakshi

తాడెపల్లిగూడెం(పశ్చిమగోదావరి): ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తూ సెప్టిక్ ట్యాంక్‌లో పడిపోయాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడెపల్లిగూడెం మండలం మొదుగుకుంట గ్రామంలో శుక్రవారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన ఎం. సాయికిరణ్(7) అనే బాలుడు ఇంటి ముందు ఆడుకుంటూ వెళ్లి సెప్టిక్ ట్యాంక్‌లో పడ్డాడు. ఇది గమనించిని స్థానిక మహిళ వెంటనే గుంటలో దూకి బాలుడిని బయటకు తీసి రక్షించింది. బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు.
 

మరిన్ని వార్తలు