సత్యవేడులో దళితుల ఆందోళన

9 Dec, 2013 14:03 IST|Sakshi

తిరుపతి : చిత్తూరు జిల్లా సత్యవేడులో సోమవారం ఉద్రిక్తత నెలకొంది. సత్యవేడు తహసీల్దార్ కార్యాలయాన్ని దళితులు ముట్టడించి శ్రీసిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీసిటీ పరిధిలోని రామచంద్రాపురంలో కేటాయించిన భూములను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళనకు దిగారు. లేనిపక్షంలో ఐఐఐటీ నిర్మాణాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇద్దరు మహిళలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

మరిన్ని వార్తలు