సేఫ్టి కోసమే గన్‌ కొన్నా..!

16 Feb, 2018 11:39 IST|Sakshi
సీవీఎస్‌ఓ ఆకె రవికృష్ణ

సాక్షి, తిరుపతి: అలిపిరి చెక్‌ పోస్టు వాహనాల తనిఖీలో పిస్టల్‌ దొరకడం కలకలం రేపింది. వివరాలివి.. ఒరిస్సాకు చెందిన రామన్ పాణిగ్రహి అనే వ్యక్తి కారులో స్టీరింగ్‌ క్యాబిన్‌లో పిస్టల్ పెట్టుకుని తిరుమలకు బయలుదేరాడు. అలిపిరి వద్ద తనిఖీ చేసిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాక అతనికి గన్‌ లైసెన్స్‌ కూడా లేదని సమాచారం. దీంతో అతని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రామన్‌ విచారణ సమయంలో పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది.

సీవీఎస్‌ఓ ఆకె రవికృష్ణ మాట్లాడుతూ.. నిందితుడు పలు కేసులలో ముద్దాయిగా ఉన్నట్లు తెలిపారు. ‘తనకు వివాదాలు ఉన్నట్లు, సేఫ్టి కోసమే గన్‌ కొన్నట్లు అతను చెబుతున్నాడు. అంతేకాక పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడు. ఒంటరిగా గన్‌తో రావడంపై మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని’ రవికృష్ణ చెప్పారు.

మరిన్ని వార్తలు