అమెరికా అమ్మాయి.... ఈస్ట్‌ గోదావరి అబ్బాయి

18 Dec, 2019 13:26 IST|Sakshi
ఒక్కటైన అమెరికా అమ్మాయి జోవని – ఈస్ట్‌ గోదావరి అబ్బాయి శరత్‌ కుమార్‌

తిరుపతిలో ఒక్కటైన ప్రేమికులు

తూర్పుగోదావరి, మలికిపురం: ఈస్ట్‌ గోదావరి అబ్బాయి, అమెరికా అమ్మాయి ఒక్కటయ్యారు. ప్రేమలో పడిన వీరు ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి ముహూర్తం చూసుకుని ఇటీవల తిరుపతిలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం మలికిపురం మండలం గుడిమెళ్లంకలోని వరుని స్వగృహం వద్ద  రిసెప్షన్‌ ఇచ్చి తమ ప్రేమ బంధాన్ని అందరితో పంచుకున్నారు.  గ్రామానికి చెందిన చెల్లుబోయిన సత్యనారాయణ  రక్షణ శాఖలో ఏటీఎస్‌గా బాధ్యతలను నిర్వహించి పదవీ విరమణ చేశారు. పెద్ద కుమారుడికి గతంలోనే వివాహం కాగా రెండో కుమారుడు శరత్‌కుమార్‌ అమెరికాలో సుమారు రెండేళ్లుగా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. అక్కడే ఒక బ్యాంకులో మేనేజరుగా పని చేస్తున్న అమెరికా అమ్మాయి జోవనితో శరత్‌ కుమార్‌కు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇద్దరి మనసులు ఒక్కటయ్యాయి.

మరిన్ని వార్తలు