ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులు ఖరారు

6 Jul, 2013 22:40 IST|Sakshi

హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులకు ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా విడుద లచేసింది. ఎఎఫ్ఆర్సి  నివేదికను పరిశీలించిన అనంతరం ప్రభుత్దవం జిఓ విడుదల చేసింది. యాజమాన్యం కోటాపై ఎల్లుండు నిర్ణయం తీసుకుంటారు.

మొత్తం 629 కాలేజీలకు సంబంధించి ఫీజులను ఖరారు చేశారు. సిబిఐటిలో అత్యధికంగా లక్షా 13 వేల 300 రూపాయలుగా నిర్ణయించారు ఆ తరువాత వాసవీ కాలేజీలో లక్షా 9 వేల 300 రూపాయలుగా నిర్ణయించారు. 195 కాలేజీలలో 30 వేల రూపాయలు, 227 కాలేజీలలో 35 వేల రూపాయలు చెల్లించాలి.  207 కాలేజీలలో ఒక్కో కాలేజీకి ఒక్కో రకంగా ఫీజులు ఖరారు చేశారు. ఈ ఫీజులు మూడేళ్లపాటు కొనసాగుతుంది.

మరిన్ని వార్తలు