పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు రాయగిరిలో హాల్టింగ్

23 Feb, 2014 01:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్చి 8 నుంచి 12 వరకు పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు రాయగిరి స్టేషన్‌లో హాల్టింగ్ సదుపాయం కల్పించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఓ ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్-గుంటూరు మధ్య నడిచే గోల్కొండ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 1.49 గంటలకు, తిరుగు ప్రయాణంలో ఉదయం 11.50 గంటలకు నిమిషం పాటు రాయగిరిలో ఆగుతుంది. సికింద్రాబాద్-బల్లార్ష మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 3.54 గంటలకు, తిరుగు ప్రయాణంలో ఉదయం 9 గంటలకు రాయగిరిలో నిమిషం ఆగుతుంది. సికింద్రాబాద్-సిరిపూర్ కాగజ్‌నగర్ మధ్య నడిచే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఉదయం 9.05 గంటలకు, తిరుగు ప్రయాణంలో సాయంత్రం 6.55 గంటలకు రాయగిరిలో నిమిషం ఆగుతుంది.
 

మరిన్ని వార్తలు