నీటితో కళకళలాడుతున్న పలు ప్రాజెక్టులు

17 Jul, 2013 16:45 IST|Sakshi

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులు నీటీతో కళకళలాడుతోంది. తుంగభద్ర డ్యామ్లో నీటిమట్టం ప్రస్తుతం 1626.60 అడుగులకు చేరుకుందని అధికారులు బుధవారం వెల్లడించారు. ప్రాజెక్ట్లో ఇన్ఫ్లో 29 వేల క్యూసెక్కులు ఉందని అధికారులు తెలిపారు. అలాగే శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్లో నీటిమట్టం 1062 అడుగులుగా నమోదు అయింది. నీటి ఇన్ఫ్లో 10 వేల క్యూసెక్కులుగా నమోదు అయింది. వీటితోపాటు ఎల్లారెడ్డిలో గత రెండు రోజులుగా భారీ వర్షం నమోదు అయింది. దీంతో కళ్యాణి ప్రాజెక్ట్ పూర్తిగా నిండి పోయింది. దాంతో ప్రాజెక్ట్లోని 500 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు.

>
మరిన్ని వార్తలు