గురుకుల కళాశాల విద్యార్థినులకు అస్వస్థత

15 Dec, 2018 08:41 IST|Sakshi
అస్వస్థతకు గురైన జి.ప్రియాంక , ఆస్పత్రిలో ఉన్న పి.ప్రమీల

కలుషిత ఆహారమే కారణం

ఆస్పత్రిలో చేరిన బాధితులు

విజయనగరం, కురుపాం: మండల కేంద్ర పరిధిలోని శివ్వన్నపేట సమీపంలో ఉన్న  గిరిజన సంక్షేమ ఆశ్రమ గురుకుల కళాశాల విద్యార్థినులు శుక్రవారం ఉదయం కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు.  జి.ప్రయాంక, పి,ప్రమీల, ఎం.భారతి, కె.స్వాతి వాంతులు, విరేచనాలతో బాధపడడంతో వెంటనే కురుపాం సీహెచ్‌సీకి వచ్చారు. వెంటనే వైద్య సిబ్బంది స్పందించి చికిత్స అందించారు. బంగాళదుంప కూరతో అన్నం తిన్న వెంటనే వాంతులు, విరేచనాలు అయ్యాయని బాధిత విద్యార్థినులు చెబుతున్నారు. విద్యార్థినుల పరిస్థితి బాగానే ఉందని డాక్టర్‌ రాఘవేంద్ర తెలిపారు. 

మరిన్ని వార్తలు