విజయవాడలో ఎడతెరపిలేని వర్షం

19 Aug, 2017 12:20 IST|Sakshi
విజయవాడ: విజయవాడలో శనివారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అలాగే మొగల్రాజపురం, పంజా సెంటర్‌, వాంబే కాలనీలో వర్షం నీరు రోడ్లపైకి వచ్చింది. దీంతో పాదచారులు తీవ్ర అవస్తలు పడ్డారు. ముఖ్యంగా  పాఠశాలలకు వెళ్లే చిన్నారులు ఎడతెరపి లేని వర్షంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించినప్పటికీ అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడంతో చిన్నారులు, వారి తల్లిదండ్రులు అవస్తలు పడ్డారు.
మరిన్ని వార్తలు