చిలకలూరి పేటలో అక్రమంగా చేపల వేట

23 May, 2015 11:33 IST|Sakshi

గుంటూరు: గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం పసమూరు గ్రామంలోని మంచినీటి చెరువులో అక్రమంగా చేపల్ని వేటాడుతున్న 10 మంది గుర్తు తెలియని వ్యక్తులను గ్రామస్థులు పట్టుకున్నారు. శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది.

ఈ సందర్భంగా వేటాడిన చేపల్ని తీసుకువెళ్లేందుకు తెచ్చిన ఐస్‌బాక్సులు, లారీని గ్రామస్థులు తమ స్వాధీనంలోకి తీసుకుని పోలీసులకు సమాచారం అందించారు.

మరిన్ని వార్తలు