సాక్షి, కడప : కడప కేంద్ర కారాగారంలో శ్రీనివాసరెడ్డి అనే ఖైదీ బుధవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. చీటింగ్ కేసులో 10 నెలల శిక్ష అనుభవిస్తున్న శ్రీనివాసరెడ్డి తన బ్యారక్లోనే లుంగీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన జైలు సిబ్బంది అతనిని వెంటనే కడప రిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతిచెందాడు.