నోరుపారేసుకున్న అచ్చెన్నాయుడు

4 Sep, 2014 09:49 IST|Sakshi
నోరుపారేసుకున్న అచ్చెన్నాయుడు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అసెంబ్లీలో నోరుపారేసుకున్నారు. రాజధానిపై చర్చకు పట్టుపట్టిన ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. తామనుకున్న చోటే రాజధాని ఏర్పాటు చేస్తామని, అడ్డుకోవడం మీ తరం కాదు కాదు మీ బాబు తరం కూడా కాదు అంటూ దురుసుగా మాట్లాడారు.

అక్కడితో ఆగకుండా నిరాధార ఆరోపణలు చేశారు. రాష్టం అల్లకల్లోలమవ్వాలని ప్రతిపక్షం కోరుకుంటోందని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ సీపీ సభ్యులు రాజధాని పెట్టాలని డిమాండ్ చేస్తున్న ప్రాంతంలో భారీ భూములు కొన్నారని ఆరోపించారు. అక్కడ రాజధాని పెట్టబోమని అచ్చెన్నాయుడు అన్నారు. రాజధాని ఎక్కడ కావాలో ప్రతిపక్ష నేత చెప్పాలంటూ ఎదురు ప్రశ్నించారు. రాజధానిపై అసెంబ్లీలో చర్చకు అవకాశమివ్వకుండా ఆయనీ ప్రశ్న వేయడం విచిత్రంగా ఉందని వైఎస్ఆర్ సీపీ సభ్యులు అన్నారు.

మరిన్ని వార్తలు