'నారాయణ సంస్థలపై గవర్నర్ దృష్టి పెట్టాలి'

3 Sep, 2016 11:56 IST|Sakshi
'నారాయణ సంస్థలపై గవర్నర్ దృష్టి పెట్టాలి'

విశాఖపట్నం : ఓటుకు కోట్లు కేసు రాజీ కోసం డ్రామాలాడుతున్నారని వైఎస్ఆర్ సీపీ నేత కొయ్య ప్రసాద్రెడ్డి ఆరోపించారు. ఓట్లు కోట్లు కేసు కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆయన నిప్పులు చెరిగారు. శనివారం విశాఖపట్నంలో కొయ్య ప్రసాద్రెడ్డి మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్ట్, ప్రత్యేక హోదా, విభజన హామీకు బ్రేక్ పడినట్లే అని ఆయన సందేహం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి.నారాయణ విద్యాసంస్థలపై దృష్టి పెట్టాలని గవర్నర్కు కొయ్య ప్రసాద్రెడ్డి సూచించారు.

మరిన్ని వార్తలు