బైక్‌ను 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన ట్యాంకర్

31 May, 2015 09:47 IST|Sakshi

రాజమండ్రి రూరల్ : తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు జాతీయ రహదారిపై ట్యాంకర్ బైక్‌ను ఢీకొట్టడంతో వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటన వివరాల ప్రకారం.. బొమ్మూరు గ్రామానికి చెందిన ఎం.రమేశ్(46) రోడ్డు దాటేందుకు బైక్‌పై వేచి ఉండగా... వేమగిరి వైపు నుంచి వేగంగా వచ్చిన ట్యాంకర్ బైక్‌ను ఢీకొట్టడంతోపాటు, 100 మీటర్ల మేర రహదారిపై బైక్‌ను ఈడ్చుకుపోయింది. రమేశ్ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు.

మరిన్ని వార్తలు