ఇన్ఫార్మర్ నెపంతో వ్యక్తి దారుణ హత్య

22 Mar, 2016 18:28 IST|Sakshi

సాలూరు: విజయనగరం జిల్లాలో  పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో ఓ వ్యక్తిని మావోయిస్టులు అత్యంత దారుణంగా కాల్చి చంపారు. ఈ సంఘటన సాలూరు ఏజెన్సీలోని దొరలతాడివలస ప్రాంతంలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో జాకరవలసకు చెందిన కూతూడి వెంకట్రావు అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు