రైతుల అభ్యున్నతికి పాటు పడాలి: జోగి రమేశ్‌

7 Aug, 2019 16:21 IST|Sakshi

సాక్షి, గూడూరు: రైతుల అభ్యున్నతికి సహకార సంఘాలు పని చేయాలని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ పిలుపునిచ్చారు. బుధవారం కృష్ణా జిల్లా గూడూరు పీఏసీఎస్‌ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి.. రైతును రాజును చేస్తే, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతును రారాజును చేయడానికి రైతు భరోసా పథకం ప్రవేశపెట్టారని తెలిపారు. రైతులకు ఎరువులు పూర్తిస్థాయిలో అందించాలని అధికారులకు సుచించారు. రుణాలు సకాలంలో చెల్లించి వడ్డీ మాఫీ రుణాలు రైతులకు అందెలా చూడాలని కోరారు. పంటల బీమా సౌకర్యం ప్రతి రైతుకు అందేలా సహకార బ్యాంకులు పని చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు