రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి ప్రైవేటు మెంబర్ బిల్లు
సాక్షి, న్యూఢిల్లీ: స్విస్ చాలెంజ్ విధానంలో ఇచ్చే కాంట్రాక్టులలో అయాచిత ప్రతిపాదనలు ఆమోదించడాన్ని నియంత్రించేందుకుగాను రాజ్యసభలో శుక్రవారం ఎంపీ విజయసాయిరెడ్డి బిల్లును ప్రతిపాదించారు.
మౌలిక వనరుల ప్రాజెక్టుల అభివృద్ధిలో ప్రైవేటు రంగం పాత్ర ఇటీవల బాగా పెరిగిపోయిందని, కాంట్రాక్టులు ఇవ్వడంలో పారదర్శకతను ఇది సవాలు చేస్తోందని బిల్లు ప్రతిపాదనకు గల కారణాలు, ఉద్దేశాలు శీర్షికన వివరించారు.