తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

28 Jan, 2017 08:38 IST|Sakshi
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: తిరుమలలో శనివారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రస్తుతం 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలనిడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. శుక్రవారం స్వామివారిని 63,332 మంది భక్తులు దర్శించుకోగా..హుండీ ఆదాయం రూ. 2 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు