-

రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి

9 Jan, 2016 17:49 IST|Sakshi

పర్చూరు (ప్రకాశం జిల్లా) : పర్చూరు మండలకేంద్రంలోని చిలకలూరిపేట వెళ్లే రోడ్డులో వై జంక్షన్ వద్ద శనివారం సాయంత్రం ఓ కారు రెండు ద్విచక్రవాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా..మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతిచెందిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు