కడప : కడప జిల్లాలో ఓ ఘరానా దొంగను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అతడి నుంచి 100 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కడప పట్టణంలోని మాసాపేటకు చెందిన వడ్లపల్లి సుసీంధ్రి ఈ నెల 8 వ తేదీన పట్టపగలే ఓ బంగారం షాపు నుంచి ఐదు బ్రాస్లెట్లు, ఓ బంగారు గొలుసును తస్కరించాడు. కాగా శుక్రవారం గంజికుంట కాలనీలో అతడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు 100 గ్రాముల బరువున్న ఐదు బ్రాస్లెట్లతోపాటు బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు.