తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

2 Jan, 2014 09:00 IST|Sakshi

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో ఓ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాశీపేట మండలం దేవాపూర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న లక్ష్మీసాగర్ ఈరోజు తెల్లవారుజామున ఈ ఘటనకు పాల్పడ్డాడు. గత కొంతకాలంగా లక్ష్మీసాగర్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దానికితోడు పని ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు అధికం కావటంతో అతను ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలిస్తున్నారు.

మరిన్ని వార్తలు