‘ఎదగారికె’ సినిమా దర్శకురాలు సుమన కిత్తూరు
సమాజంలో మనచుట్టూ కనిపించే అంశాలను, సామాజిక రుగ్మతలను ప్రశ్నిస్తూ సినిమాలు రూపొందించానని దర్శకురాలు సుమన కిత్తూరు వెల్లడించారు. నిజ జీవితగాథలను ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారని, తాను దర్శకత్వం వహించిన ‘ఎదగారికె’ సినిమా ఘన విజయమే ఇందుకు తార్కాణమని ఆమె అభిప్రాయపడ్డారు. ఆరవ బెంగళూరు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల సందర్భంగా బెంగళూరులో బుధవారం నిర్వహించిన ‘దర్శకుల ఇష్టాగోష్టి’లో ఆమె మాట్లాడారు.
విమర్శకుల ప్రశంసలు అందుకోవడం సంతోషానిచ్చింది
అగ్ని పత్రిక ఎడిటర్ అగ్ని శ్రీధర్ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా అండర్గ్రౌండ్ మాఫియా నేపథ్యంతో తాను రూపొందించిన ‘ఎదగారికె’ సినిమా కమర్షియల్గానే కాక విమర్శకుల ప్రశంసలు కూడా అందుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్పారు. ఈ సినిమా బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలతో పాటు నాగపూర్ చలనచిత్రోత్సవాలు, ముంబై ఉమెన్ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్స్కు కూడా ఎంపికైందని తెలిపారు. ఈ సినిమా రూపొందించడం కోసం తాను ఎంతో కష్టపడ్డానన్న సుమన ఆ క్రమంలో ఎదురైన ఘటనలను వివరించారు.
రానున్న రోజుల్లో కూడా ‘రియల్ లైఫ్ స్టోరీలే’
‘ఒక మనిషికి తాను చనిపోతానని తెలిసినపుడు అతని మనసులో ఎలాంటి భావాలుంటాయి, అతను చావును ఎలా స్వీకరిస్తాడు అన్న విషయాలను తెలుసుకోవడానికి నేను ఒక క్యాన్సర్ రోగితో పాటు గడిపాను. ఆమె చనిపోతుందన్న సాయంత్రం మొత్తం అక్కడే ఉండి ఆమె భావాలు, ఆమె కుటుంబ సభ్యుల వేదన ఎలా ఉన్నాయో తెలుసుకోగలిగాను’ అంటూ చిత్ర నిర్మాణానికి సంబంధించిన కొన్ని సంఘటనలను గుర్తుచేసుకున్నారు.
రానున్న రోజుల్లో కూడా సమాజంలో జరుగుతున్న దురాగతాలు, నిజ జీవిత సంఘటనల ఇతివృత్తంతోనే సినిమాలు రూపొందిస్తానని చెప్పారు. ముఖ్యంగా మహిళలపై పెచ్చుమీరుతున్న అఘాయిత్యాలపై తన తర్వాతి సినిమా ఉండవచ్చని చెప్పారు. గతంతో పోల్చుకుంటే శాండల్వుడ్లో ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం వాడకం బాగా పెరిగిందని, ఇది ఆహ్వానించదగ్గ పరిణామమని సుమన కిత్తూరు అభిప్రాయపడ్డారు.
నేడు చలనచిత్రోత్సవాల ముగింపు ఉత్సవాలు....
బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల ముగింపు ఉత్సవాలు గురువారం జరగనున్నాయి. నగరంలోని ఫన్ సినిమాస్లో గురువారం సాయంత్రం 5.30గంటలకు నిర్వహించే ముగింపు ఉత్సవాలకు గవర్నర్ హంసరాజ్ భరద్వాజ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా చలనచిత్రోత్సవాల్లో వివిధ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో బహుమతులు గెలుచుకున్న సినిమాలకు అవార్డులను అందించనున్నారు. కార్యక్రమానికి మంత్రి రామలింగారెడ్డితో పాటు శ్రీలంకకు చెందిన నటి మాలినీ ఘోన్సేకా, శాండల్వుడ్ నటుడు దర్శన్ హాజరుకానున్నారు.
వాస్తవ కథాంశాలను... ప్రేక్షకులు ఆదరిస్తారు
Published Thu, Jan 2 2014 8:58 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement