అగ్నిప్రమాదంలో వ్యక్తి సజీవ దహనం | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాదంలో వ్యక్తి సజీవ దహనం

Published Thu, Jan 2 2014 8:49 AM

అగ్నిప్రమాదంలో వ్యక్తి సజీవ దహనం - Sakshi

హైదరాబాద్ : హైదరాబాద్ శివారులో జరిగిన అగ్ని ప్రమాదంలో  ఓ వ్యక్తి సజీవ దహనానికి గురయ్యాడు. రాజేంద్రనగర్ ఉప్పరపల్లిలోని  ఓ చెత్త దుకాణంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. షాపులోని నుంచి మంటలు రావడానికి గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పింది.

అనంతరం ఘటన స్థలంలో పూర్తిగా కాలిపోయిన  ఓ వ్యక్తి మృతదేహాన్నిపోలీసులు గుర్తించారు. షాపులో చలిమంట వేయడంతో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement