ఆర్టీసీ ఎండీ ఆకస్మిక తనిఖీ

21 Nov, 2015 10:09 IST|Sakshi

సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం, సామర్లకోట ఆర్టీసీ కాంప్లెక్స్‌లను ఆర్టీసీ ఎండీ సాంబశివరావు శనివారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాంప్లెక్స్‌లలో నిరుపయోగంగా ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. వనరులను వినియోగించుకుని, సంస్థ ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన ఈ సందర్భంగా వివరించారు. నిరుపయోగంగా ఉన్న పెద్దాపురం ఆర్టీసీ భవన సముదాయాన్ని కల్యాణమంటపం, గోదాములుగా మార్చే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు