గూడూరు-చెన్నై మార్గంలో ట్రాక్ మరమ్మతులు: పలు రైళ్లు ఆలస్యం

14 Nov, 2013 08:38 IST|Sakshi

నెల్లూరు జిల్లాలోని గూడూరు -  చెన్నై మార్గంలో రైల్వే ట్రాక్ మరమ్మతులు నిర్వహిస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే గురువారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి చెన్నై వెళ్లే  పినాకిని ఎక్స్ప్రెస్ 3 గంటల ఆలస్యంగా నడుస్తుందని తెలిపింది. అలాగే పాట్నా - బెంగళూరు నగరాల మధ్య నడిచే సంఘమిత్ర ఎక్స్ప్రెస్ 3.30 గంటల ఆలస్యం అవుతుందని పేర్కొంది. వీటితోపాటు భాగమతి ఎక్స్ప్రెస్ 2.50 గంటల ఆలస్యంగా నడుస్తుందని దక్షిణమధ్య రైల్వే తెలిపింది.

మరిన్ని వార్తలు