మార్షల్స్‌తో టీడీపీ నేతల గొడవ

11 Dec, 2019 09:54 IST|Sakshi

సాక్షి, అమరావతి : అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న క్రమంలో టీడీపీ నాయకులు మార్షల్స్‌తో అనుచితంగా ప్రవర్తించారు. అసెంబ్లీ వద్ద నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నేతలు ప్లకార్డులు పట్టుకుని లోపలకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో మార్షల్స్‌ వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో లోపలికి ప్లకార్డులు తీసుకువెళ్తాం అంటూ వాళ్లు మార్షల్స్‌తో గొడవపడ్డారు. అయినప్పటికీ మార్షల్స్‌ ప్లకార్డులను లోపలికి అనుమతించకపోవడంతో.. టీడీపీ నాయకులు ఖబర్దార్‌ అంటూ వారిని హెచ్చరించారు. 
 

మరిన్ని వార్తలు