ఈనాటి ముఖ్యాంశాలు

26 Jul, 2019 20:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తిరుమలలో ఎల్‌1, ఎల్‌2 దర్శనాలు రద్దుతో మంచి ఫలితం వచ్చిందని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రోజూ సుమారు రెండు గంటల సమయం అదనంగా సామాన్య భక్తులకు లభిస్తుందన్నారు. ఎర్రమంజిల్ అసెంబ్లీ భవనాల కూల్చివేతపై తెలంగాణ  హైకోర్టు విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా హెచ్‌ఎండీఏ చట్టం 2018 గురించి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ క్రమంలో ఇందుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను సమర్పించాలని హైకోర్టు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీని ఆదేశించింది. భారత్‌తో యుద్ధం చేసే స్థాయి పాకిస్తాన్‌కు ఏమాత్రం లేదని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. శుక్రవారం కార్గిల్‌ 20వ విజయ్‌ దివస్‌ను పురస్కరించుకుని యుద్ధ వీరులకు పార్లమెంటు నివాళులు అర్పించింది.

మరిన్ని ప్రధాన వార్తలకు కింది వీడియోను వీక్షించండి..

మరిన్ని వార్తలు