నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు

3 May, 2016 15:46 IST|Sakshi

సుండుపల్లి (వైఎస్సార్ జిల్లా) : అక్రమంగా నాటుసారా తయారు చేస్తున్న స్థావరాలపై పోలీసులు దాడిచేసిన సంఘటన వానరాసపల్లి అటవీ సమీపంలో మంగళవారం జరిగింది. ఎక్సైజ్ పోలీసులు ఈ దాడుల్లో సుమారు 1200 లీటర్ల ఊట బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 70 లీటర్ల నాటుసారా కూడా స్వాధీనం చేసుకున్నారు. నాటు సారా కాస్తే కఠినంగా శిక్షిస్తామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

>
మరిన్ని వార్తలు