రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత

30 Nov, 2015 09:16 IST|Sakshi

విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం వెదురువాడ సమీపంలో సోమవారం వేకువజామున జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ట్రాక్టర్‌లో యలమంచిలి వైపు వెళ్తుండగా ఎదురుగా వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో శెట్టి దేముడు(45), కె.అప్పలనాయుడు(38) అక్కడికక్కడే చనిపోయాడు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ఘటన జరిగిందని భావిస్తున్నారు.

 

మరిన్ని వార్తలు