భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య

13 Jan, 2016 18:29 IST|Sakshi

కర్నూలు: కర్నూలు జిల్లా డోన్ మండలం కొత్తపల్లిలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో భార్యను భర్త కొట్టి చంపాడు. అనంతరం భర్త రైలు ట్రాక్ వద్దకు చేరుకుని.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.... మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు.

అలాగే భార్య మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకుని.... పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు