న్యాయం కోసం.. భర్త ఇంటి ఎదుట ధర్నా

14 Mar, 2015 11:37 IST|Sakshi

తిరుపతి: న్యాయం కోసం.. భర్త ఇంటి ఎదుట భార్య భైఠాయించిన ఘటన తిరుపతిలోని రేణిగుంట రోడ్డు వద్ద పద్మావతీనగర్లో శుక్రవారం చోటుచేసుకుంది.  న్యాయం కోసం మూడేళ్ల కొడుకుతో కలిసి ఆమె ధర్నాకు దిగింది. వివరాల్లోకి వెళితే.. 2010లో భాస్కర్రాజు, రాధికలు ప్రేమవివాహం చేసుకున్నారు. వీరికి మూడేళ్ల కొడుకు ఉన్నాడు.

అయితే 5 నెలల కిందట భాస్కర్ రెండో పెళ్లి చేసుకున్నాడంటూ రాధిక ఆరోపిస్తోంది. తాను ఉండగానే భర్త మరో పెళ్లి చేసుకున్నాడని.. తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ఎదుట భైఠాయించింది. రాధికకు మద్దతుగా మహిళ సంఘాలు కూడా ముందుకు వచ్చాయి. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు