ప్రజలకు అందుబాటులో ఉంటా

20 Apr, 2014 01:58 IST|Sakshi
ప్రజలకు అందుబాటులో ఉంటా
  •      గెలిచాక విశాఖ సమస్యలన్నింటిని పరిష్కరిస్తా
  •      విజయమ్మకు బ్రహ్మరథం పట్టిన విశాఖ ప్రజలు
  •      అడుగడుగునా పూలు, మంగళ హారతులతో స్వాగతం
  •  సాక్షి, విశాఖపట్నం: ‘ఎంపీగా గెలిచిన తర్వాత ప్రజ లందరికి అందుబాటులో ఉంటా. మీ అందరి సమస్యలు పరిష్కరిస్తా. అందమైన విశాఖను మరింత పర్యాటకప్రాంతంగా సుందరంగా తయారు చేసుకుందాం. ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేదు. మళ్లీ సువర్ణయుగం రావాలన్నా, విశాఖ అభివృద్ధి కావాలన్నా జగన్ రావాలి. తప్పకుండా మీరంతా జగన్‌ను ఆశీర్వదించండి’ అని వైఎస్ విజయమ్మ పిలుపునిచ్చారు.

    విశాఖ నగరంలో రోడ్‌షోలో భాగంగా ఆమె తూర్పు, ఉత్తరం, దక్షిణం నియోజకవర్గంలో పర్యటించిన ఆమెకు అడుగడుగునా ప్రజలంతా బ్రహ్మరథం పట్టారు. మండుటెండల్ని సైతం లెక్క చేయకుండా గంటల తరబడి రోడ్లపై నిరీక్షించారు. మహిళలు హారతులతో ఆహ్వానం పలికి దారిపొడవునా పూలతో స్వాగతం పలికారు. వీరిని ఉద్దేశించి విజయమ్మ ఉత్సాహంగా ప్రసంగించారు.

    విశాఖ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ వెంటరాగా ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఓల్డ్ డైరీఫాం జంక్షన్ వద్ద నుంచి విజయమ్మ రోడ్ షో ప్రారంభమైంది. సుమారు పది ప్రాంతాల్లో విజయమ్మ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. జగన్ ప్రభుత్వంలో జరిగే సంక్షేమ కార్యక్రమాల్ని వివరించారు. విజయమ్మను చూసేందుకు అపార్ట్‌మెంట్, ఇళ్లల్లోని నివాసులు రోడ్లపైకి చేరి తమ అభిమాన నాయకురాలిని చూసి ఆనందంతో ఉప్పొంగారు.

    విశాఖ ఉత్తర నియోజకవర్గం పార్టీ అభ్యర్థి చొక్కాకుల వెంకటరావుతో కలిసి వివిధ ప్రాంతాల్లో యాత్ర సాగించారు. దక్షిణ నియోజకవర్గం పరిధిలో పార్టీ అభ్యర్థి కోలా గురువులు వెంట రాగా.. రాత్రి 9.15 గంటలకు ద్వారకానగర్ చేరుకున్నారు. విజయమ్మ వెంట పార్టీ నియోజకవర్గ అభ్యర్థులతోపాటు నగర అధ్యక్షుడు మళ్ల విజయ్‌ప్రసాద్ ఆద్యంతం ఉండి, పార్టీ మేనిఫెస్టో కార్యక్రమాల్ని వివరించారు. రోడ్ షోలో పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు