-
రానున్నది వైఎస్సార్ సీపీ ప్రభంజనమే
కడియం, న్యూస్లైన్ : రానున్నది వైఎస్సార్ సీపీ ప్రభంజనమేనని ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు అన్నారు. సోమవారం వీరవరంలో రాజమండ్రి రూరల్ అసెంబ్లీ అభ్యర్థి ఆకుల వీర్రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొడ్డు మాట్లాడుతూ సంక్షేమరాజ్య స్థాపనే జగన్ మోహన్రెడ్డి లక్ష్యమన్నారు. వైఎ స్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పార్టీలో పలువురి చేరిక వివిధ గ్రామాల నుంచి పలువురు నాయకులు వైఎస్సార్ సీపీలో చేరారు. కీలకనేతలు ఆకుల వీర్రాజుకు మద్దతునిచ్చారు. జెడ్పీటీసీ మాజీ సభ్యులు దొంతంశెట్టి వీరభద్రయ్య, బత్తుల రా ము, మాజీ ఎంపీటీసీ సభ్యులు రేమళ్ల ప్రసాద్, లంక కనకారావు, రేమళ్ల పరమేష్, వీరవరం సర్పంచ్ పరమటి భాగ్యవతి, ఉప సర్పంచ్ కొత్తపల్లి లక్ష్మణరావు, దొంతంశెట్టి చినవీర్రాజు, బత్తుల బ్రహ్మయూత్ సభ్యులు, చేనేత సొసైటీ అధ్యక్షుడు కర్రా సూర్యచంద్రరావు, ఆదిమూ లం పెద్దబ్బు, దొంతంశెట్టి ఏకాంబరం, దోర శ్రీనివాసు సహా వందలాది మంది పార్టీలో చేరా రు. వీరిని బొడ్డు, ఆకుల సాదరంగా ఆహ్వానిం చారు. పొట్టిలంకలో సొసైటీ మాజీ అధ్యక్షుడు పాటంశెట్టి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో వందమంది, మురమండలో పలువురు చేనేత నాయకులు పార్టీలో చేరారు. రావి పాటి రామచంద్రరావు, యాదల సతీష్చంద్రస్టాలిన్, గిరజాల బాబు, దాసరి శేషగిరి పాల్గొన్నారు. -
నలుగురూ నాలుగు దారులు
సాక్షి, అనంతపురం : హిందూపురం తెలుగుదేశం పార్టీలో ఉన్న నలుగురు నాయకులు ప్రస్తుతం ఒక్కొక్కరు ఒక్కోదారి వెతుక్కుంటున్నారు. నాయకుల మధ్య సమన్వయం పూర్తిగా కొరవడింది. బాలక్రిష్ణ సోదరుని కుమారుడు సినీ నటుడు నందమూరి తారకరత్న ప్రచారం కోసం అనుమతి తీసుకోకపోవడం ఇందుకు అద్దం పడుతోంది. మంగళవారం ఉదయమే ఆయన హిందూపురం చేరుకున్నారు. వచ్చీ రాగానే పట్టణంలో రోడ్ షోలో పాల్గొనే విధ ంగా ముందుగానే రూట్ మ్యాప్ ఖరారు చేసుకున్నారు. అయితే స్థానిక నాయకుల మధ్య నెలకొన్న అంతర్గత కలహాల కారణంగా ఎవరూ తారకరత్న రోడ్ షోకు పర్మిషన్ తీసుకోలేదు. దీంతో తారకరత్న చేసేదిలేక లాడ్జికే పరిమితం అయ్యారు. ఎన్నికల వేళ ఏమి మాట్లాడాలో ఆయన కూడా ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకోకుండా నవ్వులపాలయ్యారు. రోడ్ షో నిర్వహించేందుకు అనుమతి తీసుకోక పోవడంతో ఎటూ సమయం దొరికింది కదా అని మీడియాతో మాట్లాడుతూ బాబాయిని సీఎంగా చూడాలన్నదే తన కోరిక అని తన మనసులో మాటను బయటకు వెల్లడించాడు. ఆ వెంటనే తేరుకొని కాదు కాదు ముఖ్యమంత్రి పదవి విషయమై మామ చంద్రబాబు నాయుడు, బాబాయ్ బాలక్రిష్ణలు కూర్చొని మాట్లాడుకుంటారని చెప్పారు. ఇలా ఒక్కోసారి ఒక్కో రకంగా మాట్లాడటంతో స్థానిక నాయకులు దిక్కులు చూస్తుండిపోయారు. రోడ్షోకు పోలీసులు సాయంత్రం అనుమతి ఇవ్వడంతో తారకరత్న రోడ్డుపైకొచ్చారు. అయితే ఆయన రోడ్షోలో జనం కంటే పోలీసులే ఎక్కువగా కనిపించారు. పనైపోయింది.. హిందూపురంలో ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే గెలుపుపై ఆశలు వదిలేసుకోవాల్సిందేనని టీడీపీ నేతల మధ్య చర్చ మొదలైంది. ఇక్కడి గ్రూపు తగాదాల గోల భరించలేక.. బాలక్రిష్ణ నామినేషన్ వేసిన అనంతరం ఇతర జిల్లాలో ప్రచారం కోసమని వెళ్లిపోయారు. అప్పటి నుంచి స్థానిక నేతలు సైతం ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. దీంతో టీడీపీ కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ నిశ్చల్ ఆధ్వర్యంలో ఆ పార్టీలో చేరి విజయం కోసం ప్రచారం చేస్తున్నారు. ఇదిలా వుండగా చేనేత వర్గానికి చెందిన హిందూపురం పార్లమెంటు టీడీపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్పను సన్మానం చేస్తామని ముదిరెడ్డిపల్లిలో వున్న చేనేత కుటుంబాలు సోమవారం రాత్రి పిలిపించి మరీ హెచ్చరించారు. గతంలో మంత్రిగా, ఎంపీగా వున్నా చేనేత కార్మికులకు చేసింది శూన్యమని, చేనేత కార్మికులకు దక్కాల్సిన నిధులు చాలా చోట్ల పక్కదారి పట్టినా వాటి గురించి స్పందించలేదని గట్టిగా నిలదీశారు. ఈ హఠాత్పరిణామంతో నిమ్మల కిష్టప్ప షాక్కు గురయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు రంగనాయకులు, సీపీ వెంకటరాముడు, సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్దుల్ ఘని, అంబికా లక్ష్మినారాయణలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉంటున్నారు. వీరు దూరంగా ఉండటానికి కారణం వారిలో నెలకొన్న విభేదాలు ఒకటైతే... ప్రజల వద్దకు వెళ్తున్నా స్పందన కన్పించకపోవడంతోనే దూరం దూరంగా ఉంటున్నారనేది మరో కారణం. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ సారి తెలుగుదేశం పార్టీలో స్తబ్దత నెలకొనడంతో ఎంతో కొంత చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో తారకరత్న రెండు మూడు రోజులు హిందూపురంలోనే ఉండి ప్రచారం చేయాలని నిర్ణయించారు. అయితే మొదటి రోజే స్థానిక నాయకులు హ్యాండ్ ఇవ్వడంతో ‘అదేంది బాబాయ్.. ఇక్కడ మన పార్టీ వాళ్లు ఇలాగున్నార’ం టూ బాలకృష్ణకు ఫోన్ చేసి అసహనం వ్యక్తం చేసినట్లు ఓ టీడీపీ నేత వెల్లడించారు. -
సీమాంధ్రలో వైఎస్ఆర్ సీపీకి 112 అసెంబ్లీ సీట్లు: సర్వే
హైదరాబాద్: సీమాంధ్రలో వైఎస్ఆర్ సీపీదే హవా అని 'ఆరా' సర్వే వెల్లడించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 105 నుంచి 112 అసెంబ్లీ సీట్లు వస్తాయని తాజాగా నిర్వహించిన ఆరా సర్వేలో తేలింది. 15 నుంచి18 ఎంపీ సీట్లు కైవసం చేసుకుంటుందని వెల్లడైంది. టీడీపీ-బీజేపీ కూటమికి 55 నుంచి 65 అసెంబ్లీ సీట్లు, 7 నుంచి 10 ఎంపీ సీట్లు వచ్చే అవకాశముందని తెలిపింది. కాంగ్రెస్, ఇండిపెండెంట్లకు 10 నుంచి 15 అసెంబ్లీ సీట్లు, ఒక ఎంపీ సీటు వచ్చే దక్కే అవకాశముందని సర్వే వెల్లడించింది. తెలంగాణలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశముందని పేర్కొంది. టీఆర్ఎస్కు 52 నుంచి 57 అసెంబ్లీ సీట్లు, 7 నుంచి 9 ఎంపీ సీట్లు వచ్చే అవకాశముంది. కాంగ్రెస్- సీపీఐ కూటమికి 43 నుంచి 45 అసెంబ్లీ సీట్లు, 4 నుంచి 6 ఎంపీ సీట్లు దక్కనున్నాయని తెలిపింది. టీడీపీ- బీజేపీ కూటమికి 12 నుంచి16 అసెంబ్లీ సీట్లు 2 నుంచి 3 ఎంపీ సీట్లు వస్తాయని వెల్లడించింది. వైఎస్ఆర్సీపీకి 3 నుంచి 6 అసెంబ్లీ సీట్లు, ఒక ఎంపీ సీటు దక్కేఅవకాశముంది. ఎంఐఎంకు 6 నుంచి 7 అసెంబ్లీ సీట్లు, 1 నుంచి 2 ఎంపీ సీట్లు వస్తాయని 'ఆరా' సర్వే వెల్లడించింది. -
జేసీపై ముప్పేట దాడి
సాక్షి ప్రతినిధి, అనంతపురం : జిల్లా తెలుగుదేశం పార్టీపై ఆధిపత్యం కోసం జేసీ దివాకరరెడ్డి ఆరాటపడుతోన్న తీరుపై ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. అభ్యర్థులను మార్చడం.. ఒకరికి ఇచ్చిన బీ-ఫారంను మరొకరికి ఇవ్వడం.. మిత్రపక్షానికి ఇచ్చిన స్థానంలో అభ్యర్థిని నిలబెట్టడంతో జేసీ వ్యవహరించిన తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకరరెడ్డి సైకిలెక్కిందే తడువు ఆధిపత్య పోరాటానికి తెర తీశారు. తాను పోటీ చేస్తున్న అనంతపురం లోక్సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో తాను సూచించిన వారినే బరిలో నిలపాలని బాబుకు దిశానిర్దేశం చేశారు. బీజేపీకి ఒక్క సీటు కేటాయించినా పోటీ చేయనని అల్టిమేటం జారీ చేశారు. జేసీ చెప్పినట్లే బాబు ఆడుతుండడంతో టీడీపీ శ్రేణులు నోరుమెదిపే సాహసం చేయలేదు. గత శుక్రవారం రాత్రి 11.30 గంటలకు అనంతపురం అసెంబ్లీ అభ్యర్థిగా ప్రముఖ కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్రబాబును ఎంపిక చేసినట్లు అధినేత జిల్లా నేతలకు సంకేతాలు పంపారు. బీ-ఫారంను కూడా ఫ్యాక్స్లో అమిలినేనికి పంపారు. దీంతో శనివారం ఆర్భాటంగా నామినేషన్ వేయాలని ఆయన తలిచారు. దీన్ని పసిగట్టిన జేసీ దివాకరరెడ్డి.. తనతో సంప్రదించకుండా ఎలా టికెట్ ఇస్తారని బాబును నిలదీసినట్లు సమాచారం. తాను ప్రభాకర్ చౌదరికి మాటిచ్చానని, ఆయనకే టికెట్ ఇవ్వాలని పట్టుబట్టినట్లు తెలిసింది. దీంతో అదే రోజు అర్ధరాత్రి దాటాక 1.45 గంటలకు అమిలినేనికి టికెట్ ఇవ్వడం లేదన్న విషయాన్ని ఆయనతో పాటు జిల్లా నేతలకు సమాచారం అందించారు. మరో అరగంటకే అనంతపురం స్థానంలో ప్రభాకర్ చౌదరిని ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఈ వ్యవహారంపై చంద్రబాబు, జేసీలపై అమిలినేని మండిపడుతూ ఎన్నికల్లో టీడీపీకి దూరంగా ఉండాలని తన అనుచరులకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. మండిపడుతోన్న శైలజానాథ్ మాజీ మంత్రి శైలజానాథ్ ‘ఫ్యాన్సీ’ ఆఫర్ ఇచ్చి టీడీపీ టికెట్ కేటాయించాలని సీఎం రమేష్ ద్వారా బాబుతో బేరసారాలు జరిపినా ఫలితం లేకపోయింది. చివరకు పీసీసీ చీఫ్ రఘువీరాను ఆశ్రయించిన ఆయన.. ఆ పార్టీ టికెట్పై శింగనమల స్థానానికి ఈనెల 15న నామినేషన్ వేశారు. శింగనమల టీడీపీ అభ్యర్థి బండారు రవికుమార్కు ఇచ్చిన టికెట్ను ఈనెల 16న చంద్రబాబు వెనక్కి తీసుకున్నారు. కానీ.. బీ-ఫారం మాత్రం బండారు రవికుమార్ వద్దే ఉండిపోయింది. ఇది పసిగట్టిన జేసీ దివాకర్రెడ్డి.. తాను కాదన్న శైలజానాథ్కే శింగనమల టీడీపీ టికెట్ ఇప్పిస్తానని ఎర వేశారు. శుక్రవారం అర్ధరాత్రి చంద్రబాబుతో మంతనాలు జరిపి శైలజానాథ్కే టికెట్ ఖరారు చేయించారు. శనివారం ఉదయం బండారు రవికుమార్ నుంచి సేకరించిన బీ-ఫారంను తన సమీపబంధువైన డీసీసీబీ మాజీ చైర్మన్ తరిమెల కోనారెడ్డి ద్వారా శైలజానాథ్కు పంపినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. టీడీపీ టికెట్పై శింగనమలలో నామినేషన్ వేసేందుకు శైలజానాథ్ బయలుదేరారన్న సమాచారం అందుకున్న ఎమ్మెల్సీ శమంతకమణి తన అల్లుడైన పోలీసు ఉన్నతాధికారికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో ఆ పోలీసు ఉన్నతాధికారి తన మరదలికి టికెట్ ఇచ్చి, బీ-ఫారం పంపి, ఇప్పుడు మళ్లీ శైలజానాథ్కు టికెట్ ఎలా ఇస్తారని చంద్రబాబును నిలదీశారు. ఆ పోలీసు ఉన్నతాధికారి శక్తిసామర్థ్యాలు తెలిసిన చంద్రబాబు.. వెనక్కి తగ్గి చివరి నిముషంలో శైలజానాథ్కు టికెట్ నిరాకరించారు. శనివారం టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వెళ్లిన తనను శమంతకమణి తీవ్రంగా నిందించడంతో శైలజానాథ్ మనస్థాపం చెందారు. కాంగ్రెస్ అభ్యర్థిగా మరో సెట్ నామినేషన్ వేసి వెనక్కి వచ్చారు. బండారు రవికుమార్ నుంచి సేకరించి శైలజానాథ్కు ఇచ్చిన బీ-ఫారంను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆదివారం ఉదయం జేసీ దివాకర్రెడ్డిని చంద్రబాబు ఆదేశించినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. చంద్రబాబు ఆదేశాల మేరకు శైలజానాథ్ నుంచి బీ-ఫారం వెనక్కి తీసుకోవడానికి జేసీ పవన్కుమార్రెడ్డి, తరిమెల కోనారెడ్డి తదితరులు విఫలయత్నం చేశారు. ఆ బీ-ఫారంను చింపివేసినట్లు శైలజానాథ్ చెప్పినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈవిషయం నిజం కాదని తెలియడంతో జేసీ పవన్కుమార్ స్వయంగా వెళ్లి బలవంతంగా బీ-ఫాం వెనకు తీసుకెళ్లినట్లు సమాచారం. పెడాకులైన పొత్తు పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన గుంతకల్లు అసెంబ్లీ స్థానంలోనూ జేసీ దివాకర్రెడ్డి వేలు పెట్టారు. బీజేపీ అభ్యర్థిగా ఎంపిక చేసిన వెంకట్రామయ్య బలహీనమైన అభ్యర్థని.. ఇది అనంతపురం లోక్సభపై ప్రభావం చూపుతుందని చంద్రబాబుకు జేసీ వివరించారు. గుంతకల్లు నుంచి టీడీపీ అభ్యర్థిని దింపితే లోక్సభపై ఒకింత సానుకూల ప్రభావం ఉంటుందని చెప్పారు. జేసీ ఒత్తిళ్లకు తలొగ్గిన చంద్రబాబు.. శనివారం ఉదయం గుంతకల్లు టీడీపీ అభ్యర్థిగా జితేంద్రగౌడ్ను ఎంపిక చేసి.. బీ-ఫారంను ఫ్యాక్స్లో పంపారు. అదే బీ-ఫారంతో జితేంద్రగౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారాన్ని వెంకట్రామయ్య నేరుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. తమకు కేటాయించిన సీట్లలో మీరెలా పోటీచేస్తారని టీడీపీ అధినేత చంద్రబాబును రాజ్నాథ్సింగ్ ఆదివారం నిలదీశారు. గుంతకల్లు బరిలో నుంచి టీడీపీ అభ్యర్థిని తప్పించకపోతే.. అనంతపురం జిల్లాలో వివిధ స్థానాల్లో పోటీలో ఉన్న తమ అభ్యర్థులకు బీ-ఫారంలు ఇస్తామని స్పష్టీకరించినట్లు సమాచారం. ఇది టీడీపీ అధినేత చంద్రబాబుకు ముచ్చెమటలు పట్టించింది. బీజేపీ అధిష్టానం వద్ద సాగిలపడి కుదుర్చుకున్న పొత్తు.. జేసీ తీరు వల్ల పెడాకులయ్యే పరిస్థితి ఉత్పన్నమైందని ఆ పార్టీ సీనియర్ నేతల వద్ద చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు టీడీపీ సీనియర్ నేత ఒకరు ‘సాక్షి’కి తెలపడం కొసమెరుపు. -
జగన్ ప్రభంజనం
సాక్షి, నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి జిల్లాకు విచ్చేసిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు నీరాజనం పలికారు. శనివారం రాత్రి 7 గంటల సమయంలో ఆయన వెంకటగిరి నియోజకవ ర్గంలోని రాపూరుకు వచ్చారు. జిల్లా సరిహద్దు నుంచి ప్రతి చోటా ఆయనకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. అభిమాన నేతను పలకరించేందుకు మహిళలు, చిన్నారులు, వృద్ధులు, యువకులు రోడ్లపై బారులుదీరారు. మహిళలు మంగళహారతులిచ్చి ఆశీర్వదించారు. పంగిలి రోడ్డు నుంచి రాపూరు సెంటర్ వరకు జగన్ రోడ్షో జనంతో కిక్కిరిసి పోయింది. మిద్దెలు, మేడలపై సైతం జనం కిక్కిరిశారు. సుమారు 50 నిమిషాలపాటు రోడ్షో సాగింది. జగన్ ప్రతిచోటా వాహనం నిలిపి అందరినీ ఆప్యాయంగా పలకరించారు. ‘రాబోయే కాలం మనదే, మంచి జరుగుతుంది’ అని భరోసా ఇస్తూ ముందుకు సాగారు. ‘మా రాజన్న బిడ్డ మీరు.. ఓట్లేసి ముఖ్యమంత్రిని చేసుకుంటాం’ అంటూ జగన్ను జనం ఆశీర్వదించారు. కాబోయే సీఎం జగన్ అనే నినాదాలతో హోరెత్తించారు. వేలాదిగా తరలి వచ్చిన జనంతో రాపూరు కిటకిటలాడింది. రాపూరు కూడలిలో జరిగిన బహిరంగ సభలో జగన్ చేసిన ప్రసంగం జనాన్ని ఆకట్టుకుంది. చంద్రబాబుపై కురిపించిన విమర్శల వర్షం జనంలో ఉత్సాహం నింపింది. తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలకు ఏమీ చేయని చంద్రబాబు ఇప్పుడు అన్నీ ఫ్రీగా చేస్తానని చెప్పడమేమిటని జగన్ నిలదీయడంతో ఈలలు, కేకలతో జనం స్పందించారు. బాబు తన పాలనలో రైతులు, వృద్ధులను పట్టించుకోలేదని, పేదల ఆరోగ్యం అసలు ఆయనకు పట్టలేదని జగన్ వివరించారు. చివరిలో జగన్ విలువలు, విశ్వసనీయతకు ఓట్లేస్తారా.. కుళ్లు కుతంత్రాలకు ఓట్లేస్తారా అంటూ ప్రశ్నించడంతో ‘విశ్వసనీయతకే మా ఓట్లు’ అంటూ జనం పెద్ద ఎత్తున స్పం దించారు. ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి నిన్ను సీఎంని చేసుకుంటామం టూ ఉత్సాహంగా ఈలలు, కేకలతో తమ అభిప్రాయం తెలిపారు. తాను సీఎం అయిన మరుక్షణమే రైతుల కోసం రూ. 3వేల కోట్ల స్థిరీకరణ నిధి, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకోసం రూ. 2వేల కోట్ల నిధి ఏర్పాటు చేయడంతోపాటు డ్వాక్రా రుణాల రద్దు, వృద్ధుల పింఛన్ పెంపు, అమ్మఒడి పేరుతో విద్యార్థులను ఉచితంగా చదివించడం తదితర పథకాలపై సంతకాలు చేస్తానని చెప్పారు. తొలిరోజు వెంకటగిరి, సర్వేపల్లి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో సాగిన జగన్ పర్యటనకు విశేష స్పందన లభించడంతో పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. కొమ్మిని ఆశీర్వదించండి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వెంకటగిరి నుంచి పోటీ చేస్తున్న కొమ్మి లక్ష్మయ్యనాయుడు మంచి వ్యక్తి అని, ఆయన అందరికీ మంచి చేస్తారని విశ్వాసం తనకుందని, భారీ మెజార్టీతో గెలిపించాలని జగన్ కోరారు. వరప్రసాద్ను గెలిపించండి... తిరుపతి ఎంపీగా పోటీ చేస్తున్న వరప్రసాద్ మంచి వ్యక్తి అని, ఐఏఎస్ అధికారిగా కూడా పనిచేసిన ఆయన ప్రజలకు మంచి చేస్తారని, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జగన్ పిలుపునిచ్చారు. ఘనస్వాగతం వైఎస్సార్ జిల్లాలోని చిట్వేలు మీదుగా జిల్లాలోకి ప్రవేశించిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. వీరిలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్, మేకపాటి గౌతమ్రెడ్డి, కొమ్మి లక్ష్మయ్యనాయుడు, ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, అనిల్కుమార్యాదవ్, సంజీవయ్య, పాశం సునీల్కుమార్, రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, పాపకన్ను రాజశేఖర్రెడ్డి తదితరులు ఉన్నారు. ఆశీర్వదించండి : కొమ్మి లక్ష్మయ్యనాయుడు వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని వెంకటగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి కొమ్మి లక్ష్మయ్యనాయుడు కోరారు. రాపూరులో జరిగిన వైఎస్సార్ జనభేరి సభలో ఆయన మాట్లాడారు. రాహుల్గాంధీని ప్రధాని చేయాలనే పుత్రప్రేమతోనే సోనియా రాష్ట్రాన్ని ముక్కలు చేసిందన్నారు. దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతు పలికాడని కొమ్మి ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ ఒక్కటే సమైక్య రాష్ట్రం కోసం పోరాడిందన్నారు. రాష్ట్రాభివృద్ధికోసం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. వైఎస్సార్ మరణానంతరం ఆయన ప్రవేశపెట్టిన పథకాలను కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేసిందన్నారు. జగన్ సీఎం అయితే ఆ పథకాలు మళ్లీ అమలవుతాయన్నారు. అసంపూర్తిగా ఉన్న ఎస్ఎస్కెనాల్ను పూర్తి చేసుకోవడంతో పాటు వెంకటగిరి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. జగన్ సీఎం అయితేనే రాష్ట్రాభివృద్ధి: వరప్రసాద్ మహానేత వైఎస్సార్ లాంటి సమర్థుడైన వ్యక్తి సీఎం కావాలంటే జగన్ను గెలిపించుకోవాలని తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ పిలుపునిచ్చారు. విభజన పుణ్యమాని రాష్ట్రం ప్రస్తుతం కష్టాల్లో ఉందన్నారు. జగన్ను ముఖ్యమంత్రిని చేసుకుంటే రాష్ట్రాన్ని అభివృ ద్ధి చేసుకోవచ్చన్నారు. అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలుచుకొని రాష్ట్రంతోపాటు దేశ రాజకీయాల్లో వైఎస్సార్సీపీ కీలకపాత్ర పోషిస్తుందన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement