పార్లమెంటేరియన్ల సదస్సుకు లైబీరియా అధ్యక్షురాలు

10 Dec, 2016 02:40 IST|Sakshi
పార్లమెంటేరియన్ల సదస్సుకు లైబీరియా అధ్యక్షురాలు

స్పీకర్‌ కోడెల వెల్లడి.. హాజరు కానున్న పలువురు ప్రముఖులు

సాక్షి, అమరావతి:  వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు విజయవాడలో జరిగే జాతీయ మహిళా పార్లమెంట్‌ సమావేశాలను ‘జాతి నిర్మాణానికి మహిళా సాధికారత’ అనే ట్యాగ్‌లైన్‌తో నిర్వహించనున్నట్లు శాసన సభ స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు చెప్పారు. పార్లమెంటేరియన్ల సమావేశాల సన్నాహక సమావేశం శుక్రవారం ఇక్కడ జరిగింది.

ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ సమావేశాల్లో పాల్గొనేందుకు  రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, లైబీరియా అధ్యక్షురాలు ఎల్లెన్‌ జాన్‌సన్‌ సిర్రీఫ్, బంగ్లాదేశ్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ సిరీన్‌ చౌదరి, లోక్‌సభ స్పీకర్‌  సుమిత్రా మహాజన్, గవర్నర్‌  నరసింహన్, బౌద్ధ మత గురువు దలైలామా, సచిన్‌ టెండూల్కర్, పీవీ సింధు, ఆధ్యాత్మిక గురువు పండిట్‌ రవిశంకర్‌ తదితరులు సమ్మతి తెలిపారని చెప్పారు.

మరిన్ని వార్తలు