'నేను మలాల' పుస్తకావిష్కరణ

20 Aug, 2015 17:58 IST|Sakshi
'నేను మలాల' పుస్తకావిష్కరణ

విజయవాడ : అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో మలాల పుస్తకావిష్కరణ జరిగింది. విజయవాడలోని బందరు రోడ్డులో ఉన్న సిద్ధార్థ మహిళా కాలేజీలో గురువారం ఈ కార్యక్రమం జరిగింది. కాలేజీకి చెందిన దాదాపు 2వేల మంది విద్యార్థినులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 'ఐయామ్ మలాల' పుస్తకాన్ని ఉమామహేశ్వరరావు అనే రచయిత తెలుగులో 'నేను మలాల' పేరుతో అనువదించారు.

ఈ పుస్తకాన్ని కాలేజీలోని విద్యార్థినుల చేతుల మీదుగా రచయిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మలాల స్ఫూర్తితో మహిళలు ఉన్నత విద్యనభ్యసించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాషలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును గెలుచుకున్న కాకతీయ యూనివర్సీటీ తెలుగు ఫ్రొపెసర్ కాత్యాయనీ విద్మహే కూడా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు