సాక్షి, గుంటూరు: రైలు వస్తుండగా యువకుడు పట్టాలపైకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం తెల్లవారుజామునగుంటూరు రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. తెల్లవారుజామున 4.15 గంటలకు ఒకటో నంబరు ప్లాట్ఫాంపై ఉన్న ఓ గుర్తుతెలియని యువకుడు నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రావడాన్ని గుర్తించి వెంటనే పట్టాలపైకి దూకాడు. రైలు అతని మీదుగా వెళ్లిపోవడంతో శరీరం రెండు భాగాలైంది. ఈ హఠాత్ పరిణామాన్ని చూసి ప్రయాణికులు తీవ్ర విస్మయానికి లోనయ్యారు. రైల్వే పోలీసులు వచ్చి మృతుడి వివరాల కోసం ఆరా తీశారు. రైలు రాక ముందు హిందీలో మాట్లాడాడని ప్లాట్ఫాంపై ఉన్న కొందరు చెప్పారని, పొరుగు రాష్ట్రం వాడై ఉంటాడని రైల్వే పోలీసులు తెలిపారు.