'నోట్ల రద్దుతో సామాన్యులకే ఇబ్బంది'

26 Nov, 2016 17:58 IST|Sakshi
'నోట్ల రద్దుతో సామాన్యులకే ఇబ్బంది'

ఒంగోలు : కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల  రద్దు నిర్ణయం సామాన్యులనే ఇబ్బందులకు గురిచేసిందని మాజీ మంత్రి, ప్రకాశం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లాలో శనివారం ఆయన గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ...నల్ల కుబేరులు దర్జాగా కోట్లలో డబ్బును మార్చుకుంటున్నారన్నారు. ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా కేంద్రం నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. సామాన్య ప్రజలను నట్టేట ముంచిన విజయ్ మాల్యాకు రుణం మాఫీ చేయడం చోద్యమని బాలినేని అన్నారు.

>
మరిన్ని వార్తలు