దీపావళికల్లా యాపిల్ వాచ్!

27 Aug, 2015 02:06 IST|Sakshi
దీపావళికల్లా యాపిల్ వాచ్!

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం యాపిల్ స్మార్ట్ వాచ్‌ను భారత్‌లో ఈ ఏడాదే ప్రవేశపెడుతోంది. పలు దేశాల్లో 2015 ఏప్రిల్ నుంచి అందుబాటులో ఉన్న ఈ వాచ్ దీపావళి నాటికి ఇక్కడి కస్టమర్ల చేతుల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్మార్ట్ వాచ్‌లతో పోలిస్తే అప్లికేషన్లు, పనితీరులో తమ ఉత్పాదన ప్రత్యేకమని యాపిల్ అంటోంది. కంపెనీ అంచనాలను మించి ఈ ఉత్పాదన పలు దేశాల్లో అమ్ముడవడం విశేషం. వాచ్ కలెక్షన్‌లో 18 క్యారట్ యెల్లో గోల్డ్, రోజ్ గోల్డ్ కేస్‌తో రూపొందిన మోడళ్లూ ఉన్నాయి. భారత్‌లో వేరియంట్‌నుబట్టి ధర రూ.22 వేల నుంచి 11 లక్షల వరకు ఉండొచ్చని అంచనా.

>
మరిన్ని వార్తలు