వెలుగులోకి మరో బ్యాంకు కుంభకోణం

28 Mar, 2018 14:56 IST|Sakshi

ముంబై : మరో ప్రభుత్వ రంగ బ్యాంకు కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ రంగానికి చెందిన ఐడీబీఐ బ్యాంకు లిమిటెడ్‌లో రూ.772 కోట్ల విలువైన మోసపూరిత రుణాలు జారీ అయినట్టు వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన ఐదు బ్రాంచుల్లో ఈ కుంభకోణం చోటు చేసుకుందని రాయిటర్స్‌ రిపోర్టు చేసింది. రిపోర్టు ప్రకారం ఈ మోసపూరిత రుణాలు 2009 నుంచి 2013 వరకు కాలంలో ఫిష్‌ ఫామింగ్‌ బిజినెస్‌దారులకు జారీ అయినట్టు తెలిసింది. చేపల చెరువుల నకిలీ అద్దె పత్రాలతో వీరు మోసపూరిత రుణాలు పొందినట్టు బ్యాంకు గుర్తించింది.

ఐడీబీఐ ఈ కుంభకోణ వివరాలను బయటికి వెల్లడించగానే, బ్యాంకు షేర్లు 3.5 శాతం కిందకి పడిపోయి రూ.73.6గా నమోదవుతున్నాయి. పబ్లిక్‌ రంగ బ్యాంకుల నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు ఇండెక్స్‌ కూడా 1.8 శాతం క్షీణించింది. తమ ఉద్యోగుల్లో ఇద్దరు ఈ రుణాల జారీ ప్రక్రియలో తప్పిదాలు చేసినట్టు ఐడీబీఐ తెలిపింది. వీరిలో ఒక అధికారిపై బ్యాంకు వేటు వేయగా.. మరో అధికారి ఇప్పటికే పదవీ విరమణ అయ్యారు.

మరిన్ని వార్తలు