మాల్యా బకాయి రద్దయిందా..?

17 Nov, 2016 06:57 IST|Sakshi
మాల్యా బకాయి రద్దయిందా..?

ఖాతా పుస్తకాల్లో రూ.1,200 కోట్లు రైటాఫ్ చేసిన ఎస్‌బీఐ
మరో 62 మందికి చెందిన రూ. 5,800 కోట్లు కూడా...
ఈ ఏడాది జూన్ నాటికి ఇలా చేసింది రూ. 48 వేల కోట్లు
సామాన్యుల పరిభాషలో రైటాఫ్ అంటే రద్దు చేయటమే
ఈ మేరకు వార్తలు రావటంతో పార్లమెంటులో విపక్షాల ఫైర్
ఎందుకిలా చేశారంటూ నిలదీసిన సీపీఎం, కాంగ్రెస్
అది కేవలం సాంకేతిక పదమే; రైటాఫ్ అంటే రద్దుకాదు: జైట్లీ
రుణ గ్రహీతల నుంచి వసూలు చేసి తీరతామని ప్రకటన
ఖాతాల్లో వేరే పద్దుకింద మార్చామన్న ఎస్‌బీఐ చీఫ్ అరుంధతి
రికవరీకి అన్ని చర్యలూ తీసుకుంటున్నామని స్పష్టీకరణ
ఎగవేసిన వారిలో టాప్-10 మంది రుణాలే రూ.4,600 కోట్లు!! 

సాక్షి, బిజినెస్ విభాగం
కింగ్ ఫిషర్ ఎరుుర్‌లైన్‌‌స పేరిట విజయ్‌మాల్యా తీసుకున్న రూ.1,200 కోట్ల రుణంతో సహా దాదాపు 63 మంది డిఫాల్టర్లకు చెందిన రూ.7,000 కోట్ల రుణాల్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ‘రైటాఫ్’ చేసిందంటూ వచ్చిన వార్తలు బుధవారం పార్లమెంటులో దుమారం రేపారుు. బ్లాక్ మనీ ఏరివేతకంటూ ప్రధాని మోదీ చేసిన నోట్ల రద్దు ప్రకటనతో ఇప్పటికే జనం చేతిలో వెరుు్య, రెండువేలు పట్టుకుని బ్యాంకుల ముందు పడిగాపులు గాస్తున్నారు. ఏటీఎంలు పనిచేయక, పనిచేసే కొద్ది ఏటీఎంల ముందు లైన్లో నిల్చోలేక నానా యాతనా పడుతున్నారు.

ఇలాంటి తరుణంలో... బడా బాబులకిచ్చిన రుణాల్లో ఏకంగా రూ.7వేల కోట్లను ఎస్‌బీఐ రైటాఫ్ చేయటాన్ని పార్లమెంటులో విపక్షాలు తీవ్రంగా తప్పుబట్టారుు. చివరికి ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పందిస్తూ... అది వాస్తవంగా రైటాఫ్ కాదని, వాళ్లు రుణాన్ని చెల్లించాల్సిందేనని జవాబిచ్చారు. మరోవంక ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య సైతం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి... తాము ఖాతా పుస్తకాల్లో సర్దుబాటుకోసం అలా పేర్కొన్నామే తప్ప నిజంగా రైటాఫ్ చేసినట్లు కాదని, వసూలు చర్యల్ని మరింత వేగవంతం చేస్తున్నామని చెప్పారు. దీంతో విపక్షాలు శాంతించారుు. వివరాలివీ...

దేశంలో అగ్రగామి ప్రభుత్వ రంగ బ్యాంకు కావటంతో ఎస్‌బీఐకు నిరర్థక ఆస్తులు కూడా అదే స్థారుులో ఉన్నారుు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి దాదాపు రూ.1.05 లక్షల కోట్లకు చేరాయి. ఇవి మొత్తం రుణాల్లో దాదాపు 7.14%. వీటిలో టాప్-100 మంది డిఫాల్టర్లకు చెందిన దాదాపు రూ.7,016 కోట్లను రైటాఫ్ చేసినట్లు ఎస్‌బీఐ తన ఖాతా పుస్తకాల్లో చూపించింది. ఈ 100 మందిలో విజయ్ మాల్యాతో సహా టాప్-63 మంది ఎగవేతదారుల రుణాల్ని పూర్తిగా రైటాఫ్ చేయగా, మరో 31 మంది రుణాల్ని పాక్షికంగా రైటాఫ్ చేసింది. మిగిలిన ఆరుగురి రుణాల్నీ ఎన్‌పీఏలుగా చూపించింది.

ఖాతా పుస్తకాల వివరాలతో పాటు ‘డీఎన్‌ఏ’ పత్రిక ఈ వార్తను ప్రచురించింది. 2016 జూన్ 30 నాటికి బ్యాంకు ఏకంగా రూ.48,000 కోట్ల రుణాల్ని రైటాఫ్ చేసినట్లు తెలియజేసింది. ఇది గందరగోళానికి దారితీసింది. ఒకవైపు నోట్లరద్దుతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతుండటం, మోదీ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తుండటం వంటి పరిణామాలతో ఇది అగ్నికి ఆజ్యం పోసినట్లరుుంది. దీంతో వివరణ ఇవ్వటానికి హడావుడిగా ఎస్‌బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ పదం సాంకేతికమేనంటూ తీవ్రతను తగ్గించే యత్నం చేశారు. రుణ గ్రహీత తన బాధ్యతను తప్పించుకోలేడని, ఈ రుణాల్ని వేరే పద్దుకింద చూపిస్తున్నామని జైట్లీ కూడా రాజ్యసభలో చెప్పారు.

ఇదీ... ఎన్‌పీఏల కథ
దేశంలో బ్యాంకులు పలు కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల కొద్దీ రుణాలిచ్చారుు. వీటిలో చాలా కార్పొరేట్లు తిరిగి చెల్లించేస్తున్నా... కొన్ని కంపెనీలు మాత్రం రకరకాల కారణాలు చూపిస్తూ రుణాలు తిరిగి చెల్లించటం మానేశారుు. కొన్ని కంపెనీలైతే ప్రభుత్వ అనుమతితో రుణాల్ని పునర్వ్యవస్థీకరించుకున్నారుు. అంటే కొత్త రుణాలుగా మారి.. తిరిగి చెల్లించడానికి కొంత సమయం లభిస్తుందన్న మాట. తిరిగి చెల్లించటాన్ని మానేసిన కంపెనీల మొత్తం రుణాలు.. కొన్ని లక్షల కోట్లపైనే ఉన్నారుు. వీటిని బ్యాంకులు బ్యాలెన్‌‌స షీట్లలో ‘మొండి బాకీలు’గా చూపిస్తూ వస్తున్నారుు. పాత మొండి బకారుులకు కొత్తవి తోడై... ఏటికేడాది ఇవి పెరుగుతున్నారుు తప్ప తగ్గటం లేదు.

బ్యాంకులు మూలధన లభ్యత... మొండి బాకీల్లో వసూలయ్యేవెన్నో, కానివెన్నో తేల్చుకోవటం కోసం బ్యాలెన్‌‌స షీట్స్ శుద్ధిచేసే ప్రక్రియను బ్యాంకులకు ఆర్‌బీఐ నిర్దేశించింది. దీన్లో భాగంగా 2017 మార్చి నాటికి బ్యాంకులన్నీ ఒత్తిడిలో వున్న రుణాలన్నింటినీ తమ బ్యాలెన్‌‌స షీట్లలో నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏలుగా చూపించాలి. ఒక అప్పు గనక ఎన్‌పీఏగా మారితే.. అప్పటి నుంచి ఐదేళ్లలో దానికి తగ్గ మొత్తాన్ని కేటారుుంచాలి. అంటే బ్యాంకులు తమ లాభాలు తగ్గించుకుని, అలా వచ్చిన మొత్తాన్ని ఎన్‌పీఏలకు కేటారుుంపులుగా చూపించాలన్న మాట.

 మరి రైటాఫ్ సంగతేంటి?
నిజానికి రైటాఫ్ అంటే... ఖాతాల్లోంచి పూర్తిగా తొలగించటం. ‘‘ఒక రుణం రైటాఫ్ అరుుందంటే సదరు రుణ గ్రహీతకు తిరిగి రుణాన్ని చెల్లించాల్సిన అవసరం ఉండదు. రుణాన్ని రద్దు చేయటానికి, రైటాఫ్‌కు పెద్దగా తేడా లేదు. సాధారణంగా ఎగవేతదారు హామీగా పెట్టిన ఆస్తుల్ని వేలం వేశాక... అన్ని మార్గాల్లో రావాల్సిన బకారుు వసూలు చేసుకున్నాక కూడా కొంత మొత్తం మిగిలిపోతే దాన్ని వసూలు చేసే మార్గాలేవీ లేకపోతే... ఆప్పుడు రైటాఫ్‌గా ప్రకటిస్తారు’’ అనేది చార్టర్డ్ అకౌంటెంట్ల అభిప్రాయం. ఇదే అభిప్రాయంతో బుధవారం పార్లమెంటులో సీపీఎం నేత సీతారాం ఏచూరి, కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ ప్రభుత్వాన్ని నిలదీశారు. రైటాఫ్ నిజమేనా? అంటూ... ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు.

రైటాఫ్ అంటే రుణ రద్దు కాదు: జైట్లీ
‘‘ఇదంతా ఆ పదాన్ని పలకటంలో వచ్చిన పొరపాటు. రైటాఫ్ అనే పదాన్ని యథాతథంగా తీసుకోవద్దు. రైటాఫ్ అంటే రద్దు కాదు. ఆ రుణాన్ని చెల్లించాల్సిన బాధ్యత రుణ గ్రహీతకుంటుంది. రుణం అలాగే ఉంటుంది. వసూలు ప్రయత్నాలనూ కొనసాగిస్తాం’’ అని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానమిచ్చారు. ఖాతా పుస్తకాల్లో మాత్రమే అది నిరర్థక ఆస్తి పద్దు నుంచి వేరే పద్దుకు మారుతుందని చెప్పారు. కింగ్‌ఫిషర్‌ను నేరుగా ప్రస్తావించకుండా... ఆ రుణాన్ని వేరొక ప్రభుత్వం అధికారంలో ఉండగా పునర్వ్యవస్థీకరించిందని, అది తమకో గుదిబండలా బదిలీ అరుుందని చెప్పుకొచ్చారు.

వసూలు ప్రయత్నాల్లోనే ఉన్నాం: అరుంధతీ భట్టాచార్య
ఈ రుణాలన్నిటినీ కలిపి వేరొక పేరుతో ఖాతా పుస్తకాల్లో చూపిస్తున్నామని, వసూలు చేయటానికి ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయని ఎస్‌బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య స్పష్టంచేశారు. కింగ్‌ఫిషర్ రుణానికి సంబంధించి ఆ సంస్థకు చెందిన పలు ఆస్తుల్ని 17 బ్యాంకుల కన్సార్షియం భౌతికంగా స్వాధీనం చేసుకుంది కూడా. అందులో గోవాలోని విలాసవంతమైన కింగ్‌ఫిషర్ విల్లా కూడా ఉంది. అయితే, దీన్ని  వేలం వేయబోరుునా ఎవ్వరూ కొనటానికి ముందుకు రాలేదు.

ఈ కన్సార్షియానికి ఎస్‌బీఐ నేతృత్వం వహిస్తోంది.  ‘‘ఇవి రైటాఫ్‌లు కావు. కొన్నేళ్లుగా వస్తున్న పాత పద్దులు. వీటికి తగ్గ ప్రొవిజనింగ్‌లు చేశాం. అందుకని వాటిని అకౌంట్స్ అండర్ కలెక్షన్ అనే పేరుతో విడిగా చూపిస్తున్నాం. వీటి వసూలుకు ముమ్మరమైన ప్రక్రియ సాగుతోంది’’ అని అరుంధతి వివరించారు. ‘‘ఎవ్వరినీ వదిలిపెట్టం. రికవరీకి అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. ఇక రైటాఫ్ అనే పదం కేవలం సాంకేతికం. సామాన్యుల భాషలో అర్థం చేసుకుంటే తప్పుగా ధ్వనిస్తారుు’’ అన్నారామె.

మరిన్ని వార్తలు