సరికొత్త స్మార్ట్‌ఫోన్ బుకింగుల జోరు

28 Apr, 2016 14:51 IST|Sakshi
సరికొత్త స్మార్ట్‌ఫోన్ బుకింగుల జోరు

చైనీస్ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మిజు ఎమ్3 స్మార్ట్ ఫోన్ ను భారతదేశంలో మే11న విడుదల చేస్తామని అధికారిక ప్రకటన విడుదలైన కొన్ని గంటల్లోనే ముందస్తు బుకింగుల వెల్లువ కొనసాగుతోంది. కేవలం 24 గంటల్లోనే 45 లక్షల రిజిస్ట్రేషన్ల బుకింగ్స్ జరిగాయని కంపెనీ వెల్లడించింది. బడ్జెట్ స్మార్ట్ ఫోనుగా దీన్ని ఆవిష్కరించబోతున్నామని కంపెనీ తెలిపింది. 2జీబీ ర్యామ్ తో పాటు 16 జీబీ స్టోరేజితో ఒకటి, 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజితో మరొకటి రెండు వేరియంట్లను మార్కెట్లోకి ఈ స్మార్ట్ ఫోన్ రానుంది. 16 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.6 వేలు, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,200 గాను భారత మార్కెట్లో ప్రవేశపెడతామని కంపెనీ వెల్లడించింది.


మిజు ఎమ్౩ ఫీచర్స్ :
డ్యూయల్ సిమ్
5 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే
ఆక్టా-కోర్ మీడియా టెక్ ఎమ్టీ 6750 ప్రాసెసర్
128జీబీ వరకు మైక్రో ఎస్డీ కార్డుతో సపోర్టు
13 ఎంపీ వెనుక కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా
 ఫ్లైమి ఓఎస్ 5.1 బేస్డ్ ఆండ్రాయిడ్ లాలీపప్

మరిన్ని వార్తలు