పోగొట్టుకున్న ఫోన్లను కనిపెట్టే పోర్టల్‌

31 Dec, 2019 07:51 IST|Sakshi

ఢిల్లీ వాసుల కోసం వెబ్‌సైట్‌ ప్రారంభం

త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి

న్యూఢిల్లీ: చోరీకి గురైన లేదా పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్ల ఆచూకీ దొరకపుచ్చుకునేందుకు, బ్లాక్‌ చేసేందుకు ఉపయోగపడే విధంగా కేంద్రం ప్రత్యేక పోర్టల్‌ను ఆవిష్కరించింది. ఢిల్లీ–నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ (ఎన్‌సీఆర్‌) వాసుల కోసం www.ceir.gov.in వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. సెప్టెంబర్‌లోనే ముంబైలో ఆవిష్కరించిన ఈ పోర్టల్‌ను త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు.

మరిన్ని వార్తలు