డిమాండ్ను బట్టి ఆంధ్రప్రదేశ్లోని అరకు నుంచి కూడా కాఫీ గింజలు సేకరించాలని ఎఫ్ఎంసీజీ సంస్థ నెస్లే యోచిస్తోంది. అలాగే ఉత్పత్తిని మెరుగుపర్చుకునే దిశగా కర్ణాటకలోని నంజన్గుడ్ కాఫీ ప్లాంటును రూ. 200 కోట్లతో ఆధునికీకరిస్తోంది. కాఫీ, నూడుల్స్ ప్లాంట్ల సందర్శన సందర్భంగా కంపెనీ అధికారులు వివరాలు తెలిపారు. అరకు కాఫీ గింజల కొనుగోలు కోసం ఇప్పటికే ప్రయత్నాలు జరిపామని, అయితే నాణ్యతకు సంబంధించి తిరస్కరణలపరమైన రిస్కులపై వారిలో నెలకొన్న సందేహాల కారణంగా ఫలించలేదని ప్లాంటు ఇంచార్జి నిర్మల షాపూర్కర్ పేర్కొన్నారు. అయితే పెరిగే డిమాండ్ను బట్టి వారు ముందుకొస్తే ఇక్కడ నుంచి కూడా సమీకరించగలమని ఆమె వివరించారు.